- శివమొగ్గ జిల్లాలో 58 మంది స్టూడెంట్స్ సస్పెండ్
- ఆంక్షలను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం
తుమకూరు/బెంగళూరు: కర్నాటకలో హిజాబ్గొడవ రోజురోజుకూ ముదురుతోంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కాలేజీల మేనేజ్మెంట్లు మతపరమైన చిహ్నాలతో వచ్చే స్టూడెంట్లను క్లాస్రూమ్లోకి రానివ్వకపోడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. హిజాబ్తో వస్తున్న అమ్మాయిలు కాలేజీల ముందు ఆందోళన చేస్తున్నారు. శనివారం తుమకూరు జిల్లాలోని ఎంప్రెస్ జూనియర్ పీయూ కాలేజీ ముందు ముస్లిం స్టూడెంట్లు నిరసనకు దిగారు. హిజాబ్తో క్లాసు రూమ్లోకి అనుమతించాలని డిమాండ్చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని కేసులు పెట్టా రు. కాలేజీలకు 200 మీటర్ల దూరంలో144 సెక్షన్అమలులో ఉందని, దాన్ని బ్రేక్ చేసినందుకు కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు15మంది అమ్మాయిలపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉడిపి సహా కర్నాటకలోని పలుచోట్ల స్టూడెంట్లు నిరసనలు తెలిపారు.
58 స్టూడెంట్లపై సస్పెన్షన్వేటు
శివమొగ్గ జిల్లాలోని షీరాలకొప్పలో గవర్నమెంట్కాలేజీకి హిజాబ్తో వచ్చిన స్టూడెంట్లు తమను క్లాస్రూమ్కు అనుమతించాలని డిమాండ్ చేశారు. హిజాబ్ లేకుండా రావాలని ప్రిన్సిపాల్కోరగా.. కాలేజీ మేనేజ్మెంట్కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో ప్రిన్సిపాల్58 మంది స్టూడెంట్లను సస్పెండ్ చేశారు. ‘‘ప్రిన్సిపాల్ మమ్మల్ని సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా మమ్మల్ని కాలేజీకి రావొద్దంటున్నారు” అని ఓ స్టూడెంట్ఆవేదన వ్యక్తం చేశాడు. హిజాబ్ సమస్య కారణంగా బెళగావి జిల్లాలోని విజయ్ పారామెడికల్ కాలేజీ టెంపరరీ సెలవులు ప్రకటించిందని విద్యార్థులు తెలిపారు. మరోవైపు, దక్షిణ కన్నడ జిల్లాలో ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలకు 200 మీటర్ల దూరం వరకు ఉన్న144 సెక్షన్ను ఫిబ్రవరి 26 వరకు
ప్రభుత్వం పొడిగించింది.
For More News..