నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు వచ్చాయి. ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్, నగర పాలక కమిషనర్ దిలీప్కుమార్, జడ్పీ సీఈవో సాయాగౌడ్, హౌసింగ్ పీడీ పవన్కుమార్, ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డిలో 80 ఫిర్యాదులు
కామారెడ్డిటౌన్ : కామారెడ్డి కలెక్టరేట్లో 80 ఫిర్యాదులు వచ్చాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ , అడిషనల్ కలెక్టర్లు విక్టర్, మదన్మోహన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు వీణ, పార్థసారథిరెడ్డి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
