గోపీచంద్‌‌‌‌ మరో అకాడమీ షురూ

గోపీచంద్‌‌‌‌ మరో అకాడమీ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ఇండియన్ బ్యాడ్మింటన్‌‌‌‌ గురు పుల్లెల గోపీచంద్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో మరో అకాడమీ స్టార్ట్‌‌‌‌ చేశాడు. ఇప్పటికే రెండు అకాడమీలతో ఎంతో మందిని తీర్చిదిద్దిన గోపీతో కలిసి కోటక్‌‌‌‌ మహీంద్రా బ్యాంక్‌‌‌‌ తమ కార్పొరేట్‌‌‌‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌)లో భాగంగా ఇంటర్నేషనల్‌‌‌‌ స్టాండర్డ్స్​తో  గచ్చిబౌలిలో   కొత్తగా హై పెర్ఫామెన్స్‌‌‌‌ సెంటర్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఆరు కోర్టులు, పూర్తి స్థాయి స్పోర్ట్స్‌‌‌‌ సైన్స్ సెంటర్‌‌‌‌, సింథటిక్‌‌‌‌ ట్రాక్‌‌‌‌, కోచ్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ కోర్సు సదుపాయం కలిగిన ఈ ట్రెయినింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. వరల్డ్‌‌‌‌ క్లాస్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ నెలకొల్పాలన్న తన ప్రపోజల్‌‌‌‌ను వెంటనే ఒప్పుకున్న కోటక్‌‌‌‌ మహీంద్ర బ్యాంక్‌‌‌‌కు గోపీ థ్యాంక్స్‌‌‌‌ చెప్పాడు.  ఈ అకాడమీ నుంచి మరికొందరు వరల్డ్‌‌‌‌, ఒలింపిక్‌‌‌‌ చాంపియన్లు వెలుగులోకి వస్తారన్నాడు. ఈ కార్యక్రమంలో కోటక్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ శక్తి ఏకాంబరం, షట్లర్లు పాల్గొన్నారు..