
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ బ్యాడ్మింటన్ గురు పుల్లెల గోపీచంద్ హైదరాబాద్లో మరో అకాడమీ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే రెండు అకాడమీలతో ఎంతో మందిని తీర్చిదిద్దిన గోపీతో కలిసి కోటక్ మహీంద్రా బ్యాంక్ తమ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో గచ్చిబౌలిలో కొత్తగా హై పెర్ఫామెన్స్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఆరు కోర్టులు, పూర్తి స్థాయి స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, సింథటిక్ ట్రాక్, కోచ్ డెవలప్మెంట్ కోర్సు సదుపాయం కలిగిన ఈ ట్రెయినింగ్ సెంటర్ శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెలకొల్పాలన్న తన ప్రపోజల్ను వెంటనే ఒప్పుకున్న కోటక్ మహీంద్ర బ్యాంక్కు గోపీ థ్యాంక్స్ చెప్పాడు. ఈ అకాడమీ నుంచి మరికొందరు వరల్డ్, ఒలింపిక్ చాంపియన్లు వెలుగులోకి వస్తారన్నాడు. ఈ కార్యక్రమంలో కోటక్ బ్యాంక్ డైరెక్టర్ శక్తి ఏకాంబరం, షట్లర్లు పాల్గొన్నారు..