‘డబుల్ ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ గరం గరం.. నీ ఊహలే నిరంతరం

‘డబుల్ ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ గరం గరం..  నీ ఊహలే నిరంతరం

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’. ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరింత వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా,  సోమవారం మూడో పాటను విడుదల చేశారు.  మణిశర్మ కంపోజ్ చేసిన ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ధనుంజయ్ సీపాన, సింధూజ శ్రీనివాసన్ పాడారు. ‘నరం నరం.. గరం గరం.. పదింటికే చలి జ్వరం..

నీ ఊహలే నిరంతరం.. పోతోందిరా నాలో శరం’ అంటూ శ్రీ హర్ష ఈమాని రాసిన సాహిత్యం ఆకట్టుకుంది.  పాటలో రామ్, కావ్యా థాపర్ జంట ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ ఇంప్రెసివ్‌గా ఉంది.  పూరి కనెక్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపించనున్నారు.  పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది.