
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్(PPIs)కు సంబంధించిన కొన్ని నిబంధనలు పాటించనందుకు PhonePeపై 21 లక్షల జరిమానా విధించింది. అక్టోబర్ 2023 నుండి డిసెంబర్ 2024 వరకు ఫోన్ పే కార్యకలాపాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపింది. దీనిలో లోపాలు బయటపడ్డాయి.
RBI ఆదేశాలను పాటించలేదని, ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపమని సలహా ఇస్తూ PhonePeకి నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
RBI తనిఖీలో PhonePe ఎస్క్రో అకౌంట్లో కొన్ని రోజులు నిధులు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తం కంటే ఎస్క్రో అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లు గమనించింది. అకౌంట్లో నిధులు మొత్తం తక్కువగా ఉన్న విషయాన్ని RBIకి వెంటనే తెలియజేయడంలో కూడా PhonePe విఫలమైంది.
RBI ఈ జరిమానా నిబంధనల ఉల్లంఘన వల్ల మాత్రమే విధించినట్లు స్పష్టం చేసింది. PhonePe వినియోగదారుల లావాదేవీలపై ఏమాత్రం ప్రభావం ఉండదని తెలిపింది.
PhonePeపై జరిమానాలు ఇదే మొదటిసారి కాదు. 2019లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (FPI) నిబంధనలను పాటించనందుకు 1 కోటి జరిమానా విధించగా, 2020లో ఇతర నియంత్రణ ఉల్లంఘనలపై 1.39 కోట్ల జరిమానా పడింది.