
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపియన్, ఆసియా చాంపియన్షిప్స్ బ్రాంజ్ మెడలిస్ట్ సీమా బిస్లాపై ఏడాది బ్యాన్ పడింది. డోప్ పరీక్ష కోసం తన ఆచూకీ చెప్పనందుకు గాను నేషనల్ యాం టీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి చెందిన క్రమశిక్షణ కమిటీ ఆమెపై చర్యలు తీసుకుంది. జులై 21వ తేదీనే బ్యాన్ ఆర్డర్స్ ఇవ్వగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెపై ఏడాది నిషేధం మే 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 30 ఏండ్ల సీమా 2021 ఆసియా చాంపియన్షిప్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచింది.