సింగరేణి స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు షురూ

 సింగరేణి స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు షురూ

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్​బ్యాడ్మింటన్​ పోటీలు  మంగళవారం  యైటింక్లయిన్​ కాలనీలోని ఏపీజె అబ్దుల్​కలాం స్టేడియంలో షురూ అయ్యాయి. ఆర్జీ –2 ఏరియా జీఎం బండి వెంకటయ్య ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను చూసి రాబోయే కోల్​ఇండియా పోటీల్లో విజేతలుగా నిలవాలని సూచించారు. కబడ్డీ పోటీల్లో కొత్తగూడెం జట్టుపై 15 పాయింట్ల తేడాతో మణుగూరు, ఇల్లందు గ్రూపు జట్టు, రెండో మ్యాచ్​లో మందమర్రి, బెల్లంపల్లి గ్రూపు జట్టుపై 4 పాయింట్ల తేడాతో శ్రీరాంపూర్​జట్టు గెలుపొందాయి. 

బాల్​బ్యాడ్మింటన్​ పోటీలో తొలి మ్యాచ్​లో ఇల్లందు, మణుగూరు గ్రూపు జట్టుపై రామగుండం 1, 2 గ్రూపు జట్టు, రెండో మ్యాచ్​లో కొత్తగూడెం జట్టుపై భూపాలపల్లి, ఆర్జీ –3 గ్రూపు జట్టు, మూడో మ్యాచ్​లో రామగుండం 1, 2 గ్రూపు జట్టుపై మందమర్రి, బెల్లంపల్లి గ్రూపు జట్టు, నాలుగో మ్యాచ్​లో శ్రీరాంపూర్​జట్టుపై భూపాలపల్లి, ఆర్జీ –3 గ్రూపు జట్టు, ఐదో మ్యాచ్​లో మణుగూరు, ఇల్లందు గ్రూపు జట్టుపై మందమర్రి, బెల్లంపల్లి గ్రూపు జట్టు, ఆరో మ్యాచ్​లో కొత్తగూడెం జట్టుపై శ్రీరాంపూర్​జట్టు విజయం సాధించాయి.  పర్సనల్​ డీజీఎం పి.అరవిందరావు, ఏఐటీయూసీ ప్రతినిధి జిగురు రవీందర్, ఐఈడీ డీజీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు.