- డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు
గోదావరిఖని, వెలుగు: సింగరేణి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తోందని, ఇప్పటివరకు 15 వేల హెక్టార్లలో 7 కోట్ల మొక్కలను నాటిందని ప్రాజెక్ట్స్, ప్లానింగ్డైరెక్టర్కె.వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం జీడీకే 1,3 గ్రూప్మైన్వద్ద గల ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్బెడ్సమీపంలో ఏర్పాటు చేసిన ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్ప్లాంటేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్లాడుతూ సింగరేణిలో మొదటిసారిగా ఆర్జీ 1 ఏరియాలోనే అడవి జాతులు, పండ్ల మొక్కలు నాటి వాటి మధ్య పశుగ్రాసం ఉండేలా ప్లాంటేషన్ చేస్తున్నట్లు చెప్పారు.
2025లో సింగరేణి వ్యాప్తంగా 600 హెక్టార్లలో మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మట్టి డంప్లపై ఖాళీ స్థలాలలో సుమారు 40 నుంచి 50 లక్షల మొక్కలు నాటినట్లు చెప్పారు. ఏరియా జీఎం డి.లలిత్కుమార్, ఎస్వోటూ జీఎం చంద్రశేఖర్, ఫారెస్ట్డీజీఎం బానోత్కర్ణ, రవీందర్రెడ్డి, అశోక్రావు, వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
