పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ బి. రోహిత్ రాజు

పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి : ఎస్పీ బి. రోహిత్ రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​లో ఉన్న కేసుల త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్​ రాజు పోలీస్​ అధికారులను ఆదేశించారు. హేమచంద్రాపురంలోని పోలీస్​ హెడ్​ క్వార్టర్​లో మంగళవారం పోలీస్​ స్టేషన్ల ఎస్​హెచ్​ఓలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లు, రైటర్లు, టెక్​ టీం ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ కేసుల త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు.

కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కేసు నమోదైనప్పటి నుంచి పరిష్కారమయ్యేంత వరకు ప్రతీ విషయాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలన్నారు. పోలీస్​ స్టేషన్​ పరిసరాలను రిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్​, ఎస్బీ ఇన్స్​పెక్టర్​ శ్రీనివాస్, ఐటీ సెల్​ ఇన్స్​పెక్టర్​ రాముతో పాటు పోలీస్​ అధికారులు పాల్గొన్నారు.