పెండింగ్​ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి : ఎస్పీ బి. రోహిత్​రాజు

పెండింగ్​ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి : ఎస్పీ బి. రోహిత్​రాజు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పెండింగ్​కేసుల పరిష్కారానికి పోలీస్​ అధికారులు కృషి చేయాలని ఎస్పీ బి. రోహిత్​రాజు సూచించారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్​ను బుధవారం ఆయన సందర్శించారు. పోలీస్​ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్​ స్టేషన్​ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్టేషన్​కు వచ్చే బాధితులకు న్యాయం చేసేలా వారితో బాధ్యతాయుతంగా మెలగాలన్నారు. 

పోలీస్​ స్టేషన్​ పై అంతస్థులోని జిల్లా సైబర్​ క్రైమ్స్​ కో ఆర్డినేషన్​ సెంటర్​ను సందర్శించారు. జిల్లాలో నమోదైన సైబర్​ క్రైమ్స్​ కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.