పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు: ఎస్పీ సురేశ్ కుమార్

పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు: ఎస్పీ సురేశ్ కుమార్

ఆసిఫాబాద్, వెలుగు: కృషి, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు.అథ్లెటిక్స్, యోగాలో ప్రతిభ కనబర్చిన ఒకే కుటుంబానికి చెందిన ఆనందరావు, శకుంతల, దీప్తిని  సోమవారం ఎస్పీ అభినందించి శాలువాతో సన్మానించారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 10న  జరిగిన నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్-2024లో బూరుగూడ గ్రామానికి చెందిన శకుంతల 50+ విభాగంలో 10 కి.మీ. పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచారు.

బెల్లంపల్లి ఆర్యవైశ్య భవన్​లో ఫిబ్రవరి 4న నిర్వహించిన నేషనల్ లెవల్ యోగా ఛాంపియన్షిప్ లో ఆమె కూతురు దీప్తి రెండో స్థానం సాధించగా, భర్త ఆనంద్ రావు మూడో స్థానంలో నిలిచారు. ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రతిభ కనబర్చడంతో జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని ప్రత్యేకంగా అభినందించారు. క్రీడల్లో రాణించేందుకు వయసు అడ్డుకాదన్నారు.