- సెకండ్ డోస్ తర్వాత యాంటీబాడీలు ఏర్పడినయ్
- అమెరికాలో అనుమతికి త్వరలో అప్లై చేస్తామన్న సంస్థ
వాషింగ్టన్: 5 నుంచి 11 ఏళ్ల లోపు పిల్లలకు తమ కరోనా వ్యాక్సిన్ సురక్షితమని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ వెల్లడించింది. యూఎస్లో ఈ ఏజ్గ్రూప్ పిల్లలకు అత్యవసర వాడకానికి అనుమతి కోసం త్వరలోనే అప్లై చేసుకుంటామంది. 2,268 మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలపై (5 నుంచి 11 ఏళ్ల వాళ్లు) ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ చేశామని, మామూలు డోసులో మూడో వంతు ఇచ్చామని సంస్థ వెల్లడించింది. రెండో డోసు తర్వాత పిల్లల్లో కరోనా యాంటిబాడీలు పెద్దవాళ్లలానే డెవలప్ అయ్యాయంది. జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయని చెప్పింది. ఫైజర్, బయో ఎన్టెక్ కలిసి డెవలప్ చేసిన ఈ వ్యాక్సిన్ఇప్పటికే12 ఏళ్లు పైబడిన వాళ్లకు అందుబాటులో ఉంది. మోడెర్నా కూడా పిల్లలపై ట్రయల్స్ చేస్తోంది. 6 నెలలు, ఆ తర్వాత పిల్లలపై కూడా ఫైజర్, మోడెర్నా ట్రయల్స్ ప్రారంభించాయి. ఈ ఏడాదిలోనే వీటి రిజల్ట్స్ రానున్నాయి. క్యూబా కూడా తమ దేశంలోనే తయారుచేసిన టీకాను 2 ఏళ్ల పిల్లలకు వేయడం స్టార్ట్ చేసింది. చైనాలో మూడేళ్ల పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ వేస్తున్నారు.
అమెరికాలో పెరుగుతున్న పిల్లల కేసులు
అమెరికాలో కరోనా స్టార్టయినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50 లక్షల మంది పిల్లలకు వైరస్ సోకింది. వీళ్లలో 460 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. డెల్టా కేసులు పెరగడం మొదలైన తర్వాత చిన్న పిల్లల కేసులు కూడా ఎక్కువైనయ్. ఇప్పుడిప్పుడే పిల్లలు స్కూళ్లకు వెళ్తుండటం, డెల్టా రకం వల్ల పీడియాట్రిక్ కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు.
మాస్కులు టైట్గా ఉండాలె
గాలి ద్వారా ఈజీగా వ్యాపించేలా కరోనా వైరస్ మార్పులు చెందుతోం దని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్సైంటిస్టులు చెప్పారు. టీకాలు వేసుకున్నా కూడా ప్రజలు మాస్కులు పెట్టుకోవాలని, అవి టైట్గా ఉండేలా చూసుకోవాల ని సూచించారు. తాముండే చోట్ల వెంటిలేషన్ బాగుండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా సోకిన వ్యక్తులు గాలిని బయటకు వదిలేట ప్పుడు వైరస్ను వదులుతున్నారని చెప్పారు. ఒరిజినల్ స్ట్రెయిన్ వైరస్తో ఇన్ఫెక్టయిన వాళ్లతో పోలిస్తే అల్ఫా వేరియంట్ బాధితులు 43 నుంచి 100 రెట్లు ఎక్కువగా వైరస్ను గాల్లోకి వదులుతున్నారన్నారు.