డర్టీ పిక్చర్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి లాంటి చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్లో గుర్తింపును అందుకున్నాడు మిలన్ లుథ్రియా. తాజాగా ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ వెబ్ సిరీస్ను రూపొందించాడు. ఈ సిరీస్లో మౌని రాయ్, తాహిర్ రాజ్ భాసిన్, అంజుమ్ శర్మ లీడ్ రోల్స్ చేశారు.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సిరీస్ 1962 ఢిల్లీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 13నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.