
టాలీవుడ్ నటి సురేఖ వాణి(Surekha Vani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రలు చేసి చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఓపక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు సురేఖ వాణి.
లేటెస్ట్ గా సురేఖ వాణి తిరుమలలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవాళ జనవరి 8న సురేఖ వాణి తన ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నడక మార్గాన శ్రీవారిని చేరుకున్నారు. అలాగే శ్రీవారికి తన తలనీలాలను కూడా అర్పించారు.సురేఖ వాణి తోటి భక్తులతో కలిసి కుటుంబంతో సహా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం దర్శనం పూర్తయ్యాక ఆమె తమ అభిమానులకి సెల్ఫీలు ఇచ్చి వారిని సంతోష పరిచారు. ప్రస్తుతం సురేఖ వాణి తిరుపతి ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి..
సురేఖ వాణి తన కూతురు సుప్రీతతో కలిసి హంగామా చేస్తూ ఉంటారు. మోడ్రన్ డ్రెస్సులతో, గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చలేపుతూ ఉంటారు. ఈ క్రమంలో సురేఖావాణి గుండు చేయించుకోవడం సంచలనమైంది. సురేఖావాణి గుండు వీడియోలు,ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
Telugu Actress #surekhavani along with #Supraja visited #Tirumala temple during the offering break have spotted in shaved head look.#teluguactress #actress pic.twitter.com/ksJU6aipPG
— Cinema Bugz (@news_bugz) January 8, 2024