గణేష్ మండపంలో అన్న ప్రసాదానికి కుళ్లిన బాదుషా పంపిన వ్యాపారి

గణేష్ మండపంలో అన్న ప్రసాదానికి కుళ్లిన బాదుషా పంపిన వ్యాపారి
  • స్థానికుల ఫిర్యాదుతో​ స్వీట్​హౌజ్ సీజ్

దహెగాం, వెలుగు: గణేశ్​మండపం వద్ద భోజనాల్లో స్వీట్​పెట్టేందుకు ఓ స్వీట్​హౌజ్​నుంచి తెచ్చిన బాదుషాలు కుళ్లిపోయి ఉన్నాయి. దీంతో గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సదరు స్వీట్​హౌజ్​ను అధికారులు సీజ్​ చేశారు. దహెగాం మండల కేంద్రంలో శ్రీ గణేశ్ మండలి వద్ద బుధవారం తుమ్మిడి వెంకన్న అనే భక్తుడు అన్నప్రసాదం ఏర్పాటు చేశాడు. స్వీట్​కోసం మండల కేంద్రంలోని బాలాజీ స్వీట్​హౌజ్​లో బాదుషా ఆర్డర్​ చేయగా షాపు ఓనర్ కుళ్లిపోయిన బాదుషాలు సప్లై చేశాడు. తిన్న కొంతమందికి టేస్టులో తేడా రావడంతో బాదుషాను విప్పి చూడగా లోపల కుళ్లిపోయి ఉంది.

దీంతో స్థానికులు సదరు స్వీట్ షాపునకు వెళ్లి ఓనర్​ను బాదుషాలు తినమన్నారు. తాను తిననని కరాఖండిగా చెప్పి దురుసుగా ప్రవర్తించాడు. 

దీంతో వారు పోలీస్​ స్టేషన్​లో, తహసీల్దార్​కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్​గణేశ్​వెళ్లి సదరు​స్వీట్​హౌజ్​ను పరిశీలించి సీజ్​చేశారు. అనంతరం ఫుడ్​సెక్యూరిటీ అధికారులకు సమాచారమివ్వగా ఫుడ్​షాంపిల్స్​  సేకరించారు. వాటిని ల్యాబ్​కు పంపించి తదుపరి చర్యలకు సంబంధిత అధికారులకు రిపోర్టు అందించనున్నట్లు పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే వ్యాపారస్తులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే స్వీట్​హౌజ్​ను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్​చేశారు.