ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లవు తున్నా, ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది తమన్నా. చిన్న హీరోలు, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా, సినిమాలు వెబ్ సిరీస్లు అని కాకుండా, చేతినిండా ప్రాజెక్టులతో అన్ని భాషల్లోనూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్ను అందుకుంది. చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ రూపొందించనున్న ‘భోళాశంకర్’ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. ఈ విషయాన్ని నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేశారు.
ఇప్పటికే ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవికి జంటగా నటించింది తమన్నా. ఇప్పుడు మరోసారి చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. 15 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. రీసెంట్గా చిరంజీవిపై టెస్ట్ షూట్ చేశారు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘వేదాళం’కి ఇది రీమేక్. చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. హీరోయిన్గా ఎప్పటినుంచో తమన్నా పేరు వినిపిస్తోంది. ఇప్పటికి ఫైనల్ చేశారు. మెగా మాసివ్ మూవీలో భాగమైనందుకు హ్యాపీగా ఉందని, మరోసారి మెగాస్టార్తో స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఎక్సయిటింగ్గా ఎదురు చూస్తున్నానని చెప్పింది తమన్నా.