పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి : జీకే వెంకటేశ్

పాత పెన్షన్  విధానాన్ని అమలు చేయాలి : జీకే వెంకటేశ్

కొల్లాపూర్, వెలుగు: పాత పెన్షన్  విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్  జేఏసీ డివిజన్  చైర్మన్  జీకే వెంకటేశ్​ కోరారు. ఆదివారం కొల్లాపూర్  ఎంపీడీవో ఆఫీస్​ ఎదుట ఆందోళనలకు సంబంధించిన పోస్టర్​ను రిలీజ్​ చేశారు.

 సోమవారం నాగర్​కర్నూల్​ కలెక్టరేట్ ఎదుట జరిగే ఆందోళనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్, కార్మికులు, పెన్షనర్లు పాల్గొనాలని కోరారు. ఎంపీడీవో భాస్కర్, ఎంఈవో ఇమాన్యుయేల్, శంకర్, కృష్ణ ప్రసాద్, వరప్రసాద్, వెంకటేశ్వర్లు, రాములు, నాగరాజు, కురుమయ్య, రబ్బానీ పాల్గొన్నారు.