- పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్
ఆర్మూర్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా పార్టీ శ్రేణులు పని చేయాలని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి హైదరాబాద్లో టీపీసీసీ ప్రెసిడెంట్ ను మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలపై కొద్దిసేపు చర్చించారు. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని టీపీసీసీ ప్రెసిడెంట్ సూచించారు. ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, నాయకులు విట్టం జీవన్, గంగాధర్, ఖాందేశ్ శ్రీనివాస్, దేగాం శ్రీనివాస్ గౌడ్, పూల నర్సయ్య, బారడ్ రమేశ్, జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.
