టీఎస్ ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల 

టీఎస్ ఎంసెట్ 3వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల 

హైదరాబాద్: టీఎస్ ఎంసెట్ చివరి (3వ)  దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. యూజీ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి తెలిపింది. 22వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని,  21 నుంచి 23వ తేదీ మధ్యలో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించింది. అక్టోబర్ 26న సీట్ల కేటాయింపు ఉంటుందని,  సీటు పొందిన విద్యార్థులు అక్టోబర్ 26 నుంచి 28వ తేదీ మధ్యలో ఆన్‌లైన్‌లోనే సెల్ఫ్‌ రిపోర్ట్ చేయాలని విద్యా శాఖ తెలిపింది.  

ట్యూషన్ ఫీజు  కూడా రిపోర్ట్ చేసినప్పుడు చెల్లించాలని అధికారులు తెలిపారు. స్పాట్ అడ్మిషన్లు, ప్రయివేటు అన్ ఎయిడెడ్ ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన నిబంధనలను అక్టోబర్ 27న ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు ప్రకటించారు.