తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ తేదీని TSPSC ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రీలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 19న 563పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసింది. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పాతోళ్లకు నో ఫీజ్
ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు కానుంది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టీఎస్పీఎస్సీ సైట్లో ఆన్ లైన్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. గత నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నవాళ్లు కూడా ఇప్పుడు అప్లయ్ చేసుకోవాలని, అయితే.. వాళ్లు మాత్రం ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొంది.
కొత్త వారికి మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు రూ.200, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 ఉంటుందని వెల్లడించింది. నిరుద్యోగులకు ఎగ్జామినేషన్ ఫీజు (రూ.120) నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసే సమయంలోనే రీఅప్లై , ఫ్రెష్ అనే వాటిని ఎంచుకొని అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి అదే నెల 27వ తేదీ సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది.
పోస్టులు: డిప్యూటీ కలెక్టర్లు- 45, డీఎస్పీ- 115, సీటీవో- 48, ప్రాంతీయ రవాణా అధికారి- 4, జిల్లా పంచాయతీ అధికారి- 7, జిల్లా రిజిస్ట్రార్- 6, జైళ్లశాఖలో డీఎస్పీ- 5, అసిస్టెంట్ లేబర్ కమిషనర్- 8, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్- 30, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్లు- 41, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి- 5, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి-2, జిల్లా ఉపాధి అధికారి- 5, పరిపాలనాధికారి (వైద్యారోగ్యశాఖ)- 20, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్- 38, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్- 41, మండల పరిషత్ అభివృద్ధి అధికారి- 140.