బైక్ అడ్డం పెట్టిండని పొట్టు పొట్టు కొట్టుకున్రు

బైక్ అడ్డం పెట్టిండని పొట్టు పొట్టు కొట్టుకున్రు

జనగామ జిల్లా పెంబర్తిలో పోకిరీలు రెచ్చిపోయారు. బైక్ అడ్డంగా పెట్టారని మొదలైన వాగ్వాదం రెండు వర్గాల మధ్య  ఘర్షణకు దారితీసింది. కర్రలు, ఇటుకలు, రాళ్ళతో దాడులు చేసుకున్నారు. వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే యువకులు కొట్టుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. 

దాడుల్లో కొంతమంది యువకులకు గాయాలు కాగా....  ఓ యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. యువకుల ఫిర్యాదుతో జనగామ పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. యువకుల దాడుల విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.