- ఇక్కడ చిత్ర హింసలు అనుభవిస్తున్నా.. చచ్చిపోతానేమో
న్యూఢిల్లీ: ఉపాధి కోసం వలస వచ్చి సౌదీలో చిక్కుకుపోయానని, యజమాని చేతిలో నరకం అనుభవిస్తున్నానని యూపీకి చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశాడు. తన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేంత వరకూ షేర్ చేయాలని నెటిజన్లను అభ్యర్థించాడు.
ఈ వీడియోలో ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ.. “మోదీజీ.. మీరే నన్ను కాపాడాలి. ఉపాధి కోసం వచ్చిన నన్ను ఇక్కడ మా యజమాని చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. జీతం అడిగితే హింసిస్తున్నాడు. ఇండియాకు వద్దామంటే నా పాస్ పోర్ట్ తిరిగివ్వడంలేదు. చంపేస్తానని బెదిరిస్తున్నాడు. అలహాబాద్లో నా కుటుంబం ఉంది.
నాకు మా అమ్మను చూడాలని ఉంది. మీరే నన్ను కాపాడాలి. లేదంటే నేను ఇక్కడే చచ్చిపోతాను. దయచేసి నన్ను కాపాడండి!" అంటూ ఆ యువకుడు కన్నీళ్లతో వేడుకున్నాడు. దీనిపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. ఆ వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
