కరోనా, లాక్డౌన్ కారణంగా ఆఫీసుకు వెళ్లే భార్యాభర్తల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ ఫ్యామిలీ టైం దొరికిందనే సంతోషం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతోంది కొందరిలో. రోజంతా ఇంట్లోనే ఉండడం, పని ఒత్తిడి వల్ల దంపతుల మధ్య చిన్న చిన్న గొడవలు పెరిగి వాళ్ల అన్యోన్యతను దెబ్బతీస్తున్నాయి. అయితే ఇద్దరూ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత తొందరగా ఇలాంటి వాటి నుంచి బయటపడొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు అంటున్నారు సైకాలజిస్ట్లు.
కరోనా టైంలో ఇద్దరు కూడా ఒకే ఎమోషన్స్ను ఎక్స్పీరియెన్స్ చేస్తున్నారని గ్రహించాలి. ఒకరికొకరు సర్ది చెప్పుకోవాలి. మొదట్లో గొడవ పడినప్పుడు ఇద్దరినీ దగ్గర చేసిన సంఘటనలను గుర్తుచేసుకోవాలి. లవ్ స్ట్రాంగ్గా ఉంటే ఏ గొడవ అయినా నిమిషాల్లో సాల్వ్ అవుతుంది. ఎప్పుడూ ఒకరి మాటే నెగ్గాలని అనుకోవద్దు. ఒక్కోసారి పార్ట్నర్ కోణంలోంచి ఆలోచించాలి. అప్పుడే వాళ్లను అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. దాంతో ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. అవసరాలను, చెప్పాలనుకున్న విషయాలను క్లియర్గా చెప్పాలి. అలాచేస్తే రిలేషన్షిప్లో ఏ ప్రాబ్లమ్ రాదు. అవతలి వాళ్లు ఏదైనా చెప్పినప్పుడు కామ్గా వినాలి. అంతేకానీ వెంటనే రియాక్ట్ అవకూడదు. ఇద్దరూ హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు ఆ విషయాలను డిస్కస్ చేయొద్దు. ఇల్లు, ఆఫీసు పనులకు బ్రేక్ ఇచ్చి, కాసేపు ఏకాంతంగా గడపాలి. దాంతో రిలేషన్షిప్ పాజిటివ్గా, హెల్దీగా ఉంటుంది.