
- హైదరాబాద్-నాగ్పూర్ఇండస్ట్రియల్కారిడార్లో భాగంగా నిర్మాణం
- రూ.1,206 కోట్ల అంచనా వ్యయంతో ఫేజ్ 1.. టెండర్లకు ఆహ్వానం
- స్కూళ్లు, హాస్పిటళ్లు సహా అన్ని సౌలతులు ఏర్పాటు
- మొదటి దశలో 1.90 లక్షల మందికి ఉద్యోగాలు
- నిర్మాణ గడువు మూడేండ్లు.. డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్నాలుగేండ్లు
హైదరాబాద్, వెలుగు: జహీరాబాద్ను స్మార్ట్సిటీగా డెవలప్చేసేందుకు రాష్ట్ర సర్కార్ కార్యాచరణ వేగవంతం చేసింది.కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో చేపడుతున్న హైదరాబాద్-నాగ్పూర్ఇండస్ట్రియల్కారిడార్లో భాగంగా జహీరాబాద్ను ఇండస్ట్రియల్హబ్గా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వ సహకారంతో జహీరాబాద్ను ఇండస్ట్రియల్స్మార్ట్సిటీగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది.
ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ఇన్ఫ్రాస్ట్రక్చర్కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా 3,245.48 ఎకరాల భూములు సమకూర్చింది.జహీరాబాద్ఇండస్ట్రియల్స్మార్ట్సిటీ ఫేజ్1 అభివృద్ధికి గత నెల 28న టీజీఐఐసీ టెండర్లు కూడా ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు అక్టోబర్7 వరకు అవకాశం ఇచ్చింది. మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేయడానికి రూ.1,206.44 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దానికి అదనంగా జీఎస్టీ, ఇతర చార్జీలు, ఫీజులను కలిపింది. మరో రూ.24.13 కోట్లు ఆపరేషన్అండ్మెయింటెనెన్స్కాస్ట్గా పేర్కొంది.
మూడేండ్లలో పూర్తి..
టెండర్దక్కించుకున్న సంస్థ మూడేండ్లలో జహీరాబాద్ఇండస్ట్రియల్స్మార్ట్సిటీని అభివృద్ధి చేయాలని టెండర్డాక్యుమెంట్లో టీజీఐఐసీ పేర్కొంది. సిటీ పూర్తయినట్టు కంప్లీషన్సర్టిఫికెట్ పొందినప్పటి నుంచి నాలుగేండ్ల పాటు డిఫెక్ట్లయబిలిటీ పీరియడ్ఉంటుందని స్పష్టం చేసింది.
పనుల్లో భాగంగా సిటీ డిజైన్, నిర్మాణం, టెస్టింగ్, కమిషనింగ్, ఆపరేషన్ అండ్మెయింటెనెన్స్ పనులన్నింటినీ నిర్మాణ సంస్థే చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది. స్మార్ట్సిటీ అభివృద్ధిలో భాగంగా గ్రీన్ఫీల్డ్రోడ్లను వేయనున్నారు. జియోటెక్నికల్, జియోఫిజికల్టెస్టులు చేసిన తర్వాతే స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టాలని.. నేల పరిస్థితులపై అధ్యయనం చేశాక నిర్మాణాలను ప్రారంభించాలని పేర్కొన్నారు.
విదేశీ ప్రమాణాలతో..
విదేశీ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా జహీరాబాద్స్మార్ట్సిటీని డెవలప్ చేయనున్నారు. ముఖ్యంగా రోడ్ల విషయంలో అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్, నార్వే, నెదర్లాండ్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, జపాన్వంటి దేశాల్లో పాటిస్తున్న ప్రమాణాలకు తగ్గట్టు పనులు చేపట్టాల్సి ఉంటుందని టెండర్డాక్యుమెంట్లో టీజీఐఐసీ స్పష్టం చేసింది. టెండర్దక్కించుకునే సంస్థ ఆయా దేశాల్లోని కోడ్స్ప్రాక్టీస్, స్పెసిఫికేషన్స్, గైడ్లైన్స్కు అనుగుణంగా వివరాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
రోడ్ల నిర్మాణానికి సంబంధించి కోడ్ల వివరాలనూ టెండర్డాక్యుమెంట్లో వెల్లడించింది. అమెరికన్అసోసియేషన్ఆఫ్స్టేట్హైవే ట్రాన్స్పోర్టేషన్ అఫీషియల్స్(ఏఏఎస్హెచ్టీవో), అమెరికన్సొసైటీ ఫర్ టెస్టింగ్ఆఫ్మెటీరియల్స్(ఏఎస్టీఎం), యూరో కోడ్స్వంటి ప్రమాణాలను ప్రామాణికంగా తీసుకోవాలని సూచించింది.
స్మార్ట్ సిటీలో అన్ని సౌకర్యాలు ఉండేలా అధికారులు ప్లాన్చేస్తున్నారు. రోడ్లు, యుటిలిటీ డక్ట్లు, చిన్న వంతెనలు/క్రాస్డ్రైనేజ్స్ట్రక్చర్స్, విద్యుదీకరణ (సబ్స్టేషన్ల నిర్మాణం, నెట్వర్క్, కేబుల్స్, ఎర్తెన్ట్రెంచ్లు, ట్రాన్స్ఫార్మర్లు), నీటి వసతి కల్పన (అగ్నిప్రమాదాలు జరిగితే ప్రత్యేకంగా నీటి వనరులు, గ్రౌండ్లెవెల్వాటర్రిజర్వాయర్లు, ఎలివేటెడ్లెవెల్ సర్వీస్రిజర్వాయర్, ఫైర్ఫైటింగ్హైడ్రెంట్సిస్టమ్), రీసైకిల్వాటర్, స్టార్మ్వాటర్నెట్వర్క్, రెయిన్వాటర్హార్వెస్టింగ్సంపులు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం/పారిశ్రామిక వ్యర్థ జలాల నిర్వహణ, కామన్డ్రైనేజ్ట్రీట్మెంట్ప్లాంట్లు, వాటర్ట్రీట్మెంట్ప్లాంట్లు (పంపింగ్స్టేషన్స్, ట్యాంకులు, నీటి సంపులు), ఎంట్రెన్స్ప్లాజా అండ్బౌండరీ ఫెన్సింగ్వంటి సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నది. కాగా, స్మార్ట్సిటీలో భాగంగా దాదాపు 4 లక్షల మంది దాకా ఉపాధి కల్పించనున్నారు. అందులో ఫస్ట్ఫేజ్లో 1.9 లక్షల మందికి ఉపాధి లభించనుంది. అంతేగాకుండా ప్రైమరీ స్కూళ్లు, ఇండ్లు, హాస్పిటళ్ల వంటి సౌకర్యాలనూ కల్పించనున్నారు.