ఏపీలో కరోనాతో ఒక్కరోజే 104 మంది మృతి

ఏపీలో కరోనాతో ఒక్కరోజే 104 మంది మృతి
  • కొనసాగుతున్న కరోనా స్వైర విహారం
  • ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది మృతి
  • గడచిన 24 గంటల్లో 20 వేల 811 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా సునామీ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24గంటల్లో 20 వేల 937 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. మరణాలు కూడా నిన్నటి మాదిరే వంద దాటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 104 మంది కరోనా కాటుకు బలికాగా.. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 15 మంది ఉండడం గమనార్హం. తమిళనాడు, కర్నాటకలను ఆనుకుని ఉన్న చిత్తూరు జిల్లాలో కాకతాళీయమో యాదృచ్చికమో గాని నిన్నటి మాదిరే ఇవాళ కూడా 15 మరణాలు నమోదయ్యాయి. 
ఒకవైపు లాక్ డౌన్ ఆంక్షలు కఠినతరం చేస్తూ మరోవైపు వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నా కరోనా మరణాలతోపాటు  కొత్త కేసులు.. రోజు రోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 
గడచిన 24 గంటల్లో ఒక్క చిత్తూర జిల్లాలో 15 మంది చనిపోగా, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో 10మంది చొప్పున, తూర్పు గోదావరి, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 9మంది చొప్పున, కృష్ణా జిల్లాలో 8 మంది, కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు చొప్పున కరోనాతో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 92 వేల 231 మందికి వైద్య పరీక్షలు చేయగా 20 వేల 937 మందికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే గడచిన 24 గంటల్లో 20 వేల 811 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.