ఏపీలో ఇవాళ కూడా 104 మరణాలు

ఏపీలో ఇవాళ కూడా 104 మరణాలు
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మృతి
  • ఇవాళ 16 వేల 167 కొత్త కేసులు నమోదు

అమరావతి: ఏపీలో కరోనా మరణ మృదంగం కొనసాగుతోంది. ప్రతిరోజు వందకు పైగా మరణాలు సంభవిస్తున్న రాష్ట్రంలో ఇవాళ కూడా 104 మరణాలు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16 వేల 167 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 కరోనా మరణాలు నమోదు కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విశాఖపట్టణంలో  11 మంది, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో 9 మంది చొప్పున, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున, ప్రకాశం జిల్లాలో ఏడుగురు, గూర్పు గోదావరి, కృష్ణ, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కడప జిల్లాలో ఒకరు కరోనా నుంచి కోలుకోలేక తుదిశ్వాస విడిచారు.
గడచిన 24గంటల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 84 వేల 224 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా వారిలో 16 వేల 167 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో వైపు గడచిన 24 గంటల్లో 21 వేల 385 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. జిల్లాల వారీగా ఇవాళ నమోదైన కొత్త కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.