అయెధ్యలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా కొందరు ఆకతాయిలు చెలరేగిపోయారు. ఉత్తర్ ప్రదేశ్ల లోని ఆగ్రాలోని బిలోచ్ పురాలోని మసీదులోకి కొందరు వ్యక్తులు వెళ్లి కాషాయ జెండాను ఊపారు. మసీదు సంరక్షకుడు జహీరుద్దీన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మసీదు వద్దకు చేరుకుని వారిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకుని సోమవారం ఆగ్రాలోని బిలోచ్ పురా ప్రాంతంలో ఊరేగింపు నిర్వహించారు. బిలోచ్పురాలోని మసీదులోకి 11 మంది వెళ్లి కాషాయ జెండా ఊపారు. మసీదు సంరక్షకుడు జహీరుద్దీన్ సమాచారంతో అక్కడికి చేరుకుని వారందరిని అరెస్టు చేసి జడ్జి ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. వారికి కొన్ని రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు.