
పెద్దమందడి, వెలుగు: మండలంలోని మోజెర్ల గ్రామ శివారులోని శంకర్ సముద్రం రిజర్వాయర్ ప్యాకేజీ–19 కెనాల్ వద్ద శుక్రవారం 11 అడుగులు కొండచిలువను పట్టుకున్నారు. నాలుగు రోజులుగా బ్రిడ్జి రిపేర్ పనులు చేస్తున్న కూలీలు కొండచిలువను గుర్తించి ఇరిగేషన్ ఏఈ రమేశ్, కాంట్రాక్టర్ ధనుంజయ్ కు చెప్పారు. సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్ కు సమాచారం ఇవ్వగా, వారు కొండచిలువను పట్టుకొని, అటవీప్రాంతంలో విడిచిపెట్టారు.