జూరాలకు తగ్గిన వరద .. 11 గేట్ల ద్వారా నీళ్లను వదులుతున్న అధికారులు

జూరాలకు తగ్గిన వరద .. 11 గేట్ల ద్వారా నీళ్లను  వదులుతున్న అధికారులు

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక ప్రాజెక్టుల నుంచి  వరద తగ్గడంతో ఆదివారం 11 గేట్లను మాత్రమే ఓపెన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 317.250 మీటర్ల నీటిని ఉంచుకొని 11 గేట్ల ద్వారా 42,637 క్యూసెక్కులు వదులుతున్నారు. 

ఆల్మట్టి డ్యాం దగ్గర 518.04 మీటర్ల నీటిని నిల్వ ఉంచి 57 వేల క్యూసెక్కులను నారాయణపూర్ డ్యామ్ కు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్ దగ్గర 491.35 మీటర్ల నీటిని నిల్వ ఉంచుకొని 14 గేట్లను ఎత్తి 29,500 క్యూసెక్కులను జూరాల ప్రాజెక్టుకు వదులుతున్నారు.