వైభవంగా అవధూత స్వామి పల్లకి ఊరేగింపు

వైభవంగా అవధూత స్వామి పల్లకి ఊరేగింపు

నారాయణపేట, వెలుగు: పట్టణంలోని సుభాష్ రోడ్ లో కొలువుదీరిన సద్గురు అవధూత నర్సింహస్వామి వారి 132వ సజీవ సమాధి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం మఠం కమిటీ ఆధ్వర్యంలో భజన సంకీర్తనలు, మంగళ హారతులు, మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించారు.  

సుప్రభాత సేవ, కాకడ హారతి, రుద్రాభిషేకం, పాదుకపూజ, అఖండ దీప ప్రజ్వలన, మహా అలంకరణ, మహా మంగళ హారతి, నైవేద్యం సర్వదర్శనం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. మఠం కమిటీ సభ్యులు, భక్తులు స్వామిని దర్శించుకున్నారు.