![అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం](https://static.v6velugu.com/uploads/2023/01/14-members--injured-as-vehicle-with-pilgrims-collides-with-truck-in-Assam_MBvQLSki9T.jpg)
అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 17మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న ఓ వాహనం ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని దగ్గరలోని మోరిగావ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మకర సంక్రాంతి సందర్భంగా లోహిత్ నదిలో పుణ్యస్నానం చేసి తిరిగి గౌహతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.