మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా వెట ర్నరీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో మరో 14 మంది సిబ్బంది డిప్యుటేషన్లు రద్దు చేస్తూ ఆ శాఖ అధికారి యాకూబ్ రెడ్డి ఆర్డర్స్ జారీ చేశారు.
ఇంతకుముందు జేడీగా ఉన్న శంకర్ విచ్చలవి డిగా డిప్యుటేషన్లు ఇచ్చి వసూళ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలు రావడం, ఏసీబీ విచారణ కొనసాగుతుండడంతో ఆయన హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేశారు. ఇటీవల శంకర్ భార్య విజయభారతితో పాటు మరో ఐదుగురు డిప్యుటేషన్లు క్యాన్సిల్ చేయగా, తాజాగా 14 మంది డిప్యుటేషన్లు రద్దు చేశారు.
