బంగ్లదేశ్​లో వ్యాన్, ట్రక్కు ఢీ.. 15మంది మృతి

బంగ్లదేశ్​లో వ్యాన్, ట్రక్కు ఢీ.. 15మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్​లో బుధవారం వ్యాన్​ను ట్రక్కు ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో 15మంది భవన నిర్మాణ కార్మికులు మృతిచెందారని అధికారులు తెలిపారు. ఇసుక లోడ్ తో వెళుతున్న​ట్రక్కు తెల్లవారుజామున 5.30 ప్రాంతంలో కుతుబ్​పూర్​ ఏరి యాలో ఓ​వ్యాన్​ను ఢీకొట్టింది. ఈ మేరకు స్థానిక మీడియా సంస్థ ఢాకా ట్రిబ్యూన్ కథనాన్ని​ ప్రచురిం చింది. ట్రక్కు డ్రైవరు నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఉస్మానీనగర్​ఫైర్ సర్వీస్ సిబ్బంది తెలిపా రు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్​లో 25 నుంచి 30 మంది ప్రయాణిస్తు న్నారు. ప్రమాద స్థలంలో 11మంది, ఆస్పత్రికి తరలిస్తుండగా నలుగురు  ప్రాణాలు కోల్పోయారని ఇస్లామ్​ చెప్పారు. బాధిత  కుటుంబాలకు మృతదేహాలను అప్పగించామని అడిషనల్​ ఎస్పీ​ మసూద్ ​రానా వెల్లడించారు.