జన్నారం, వెలుగు: హైదరాబాద్లోని దూలపెల్లి ఫారెస్ట్ అకాడమీకి చెందిన 16 మంది ట్రైనీ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు బుధవారం కవ్వాల్ టైగర్ జోన్ లో పర్యటించారు. టైగర్ జోన్లోని వన్యప్రాణుల కోసం ఏర్పాటు చేసిన నీటి కుంటలు, గ్రాస్ ల్యాండ్ ను పరిశీలించారు.
అడవిలో చేపడు తున్న అభివృద్ధి పనులను స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్లు వారికి వివరించారు. తాళ్లపేట, జన్నారం రేంజ్ లకు చెందని ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
