కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్లో 164 సెల్ఫోన్లు రికవరీ

కామారెడ్డి జిల్లాలో స్పెషల్ డ్రైవ్లో 164  సెల్ఫోన్లు రికవరీ

కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో స్పెషల్​ డ్రైవ్ ద్వారా 164 సెల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు.   శుక్రవారం తన ఆఫీస్​లో ఎస్పీ వివరాలు వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీ అయిన ఫోన్లను  సీఈఐఆర్ ద్వారా రికవరీ చేశామన్నారు. 164 సెల్​ఫోన్ల విలువ సుమారు  రూ. 27 లక్షలు ఉంటుందన్నారు.   ప్రతి నెలా 150కి పైగా సెల్​ఫోన్లను రికవరీ చేస్తున్నామన్నారు.  

సెల్​ఫోన్ల రికవరీ కోసం జిల్లా పోలీసు ఆఫీస్​లో  రిజర్వు ఎస్సై బాల్​రాజు ఆధ్వర్యంలో స్పెషల్​ టీమ్​ ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు  1,679 సెల్​ఫోన్లను రికవరీ చేశామని,  వీటి విలువ రూ. 2 కోట్ల 53 లక్షల వరకు ఉంటుందన్నారు.   అడిషనల్​ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్సీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు