
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన17 మంది మావోయిస్టులు భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో గురువారం మీడియా సమావేశంలో భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్ రాజు వివరాలు వెల్లడించారు. ఇద్దరు ఏసీఎంలు, నలుగురు పార్టీ మెంబర్లు, 11 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయినట్లు చెప్పారు. వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారని తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు 282 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.