కమాలుద్దీన్​పూర్​ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కమాలుద్దీన్​పూర్​ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఖిల్లాగణపురం, వెలుగు:  ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్​పూర్​ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18  ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై సురేశ్ గౌడ్ తెలిపారు. గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారంతో  తహసీల్దార్  బి. సుగుణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. 

 ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఆన్​లైన్​ వే బిల్లులు లేకుండా ఇసుకతో  లోడ్​ అయిన 18 ట్రాక్టర్​ ట్రాలీలను గుర్తించి పోలీసులుకు సమాచారమిచ్చారని తెలిపారు.  తహసీల్దారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టరు యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.