
- 19 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
- ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో19 మంది డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రమోషన్ పొందిన వారిలో తహసీల్దార్లు కే.మహేశ్వర్, సూర్య ప్రకాశ్, మురళీ కృష్ణ, మాధవి, అలివేలు, శకుంతల, కే.సత్యపాల్ రెడ్డి, వి. సుహాసిని, భూక్యా బన్సీలాల్, బి. జయశ్రీ, ఎం. శ్రీనివాస్ రావు, డి. దేవుజ, డి. ప్రేమ్ రాజ్, ఉప్పల లావణ్య, డి. చంద్రకళ, రాధా బాయి ఉన్నారు. సెక్షన్ ఆఫీసర్లు పి. నాగరాజు, ఐవీ. భాస్కర్ కుమార్.. సీసీఎల్ఏ అధికారి పి. మాధవి దేవీ ఉన్నారు.