ఖమ్మంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఖమ్మంలో ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

జూలూరుపాడు, వెలుగు :  మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలకు చెందిన 1998-,1999  సంవత్సరపు పూర్వ విద్యార్థుల సమ్మేళనం   సోమవారం నిర్వహించారు. గురువులను ఘనంగా సన్మానించారు. నాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో  పూర్వ విద్యార్థులు మాదినేని సతీశ్, కొలిపాక సురేశ్,పెండ్యాల నరేశ్, ఎదులాపురం నరసింహారావు , పోలూరి నరేశ్, షేక్ కరీముల్లాల, గురువులు లక్ష్మీనరసింహ, విశ్వనాథరాజు, సూరి, రామ్మూర్తి, వీరనారాయణ, నాగేశ్వరరావు, సునీల్, వాణి, మణెమ్మ,  తదితరులు పాల్గొన్నారు