వేములవాడలో గంజాయి ముఠా అరెస్ట్

వేములవాడలో గంజాయి ముఠా అరెస్ట్

వేములవాడలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన వికాస్, ఒరిస్సాకి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయిని జగదల్ పూర్ నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు పోలీసులు. అక్రమంగా తరలించి గంజాయి అమ్ముతున్న వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు. 

గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు సహకరించాలన్నారు. ఇప్పటికే ఈ ఏడాది14 కేసుల్లో 39 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని.. అలాంటి యువత డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్ధాలకు బానిసలు కావద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.