మధ్యప్రదేశ్ లో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురి మృతి

మధ్యప్రదేశ్ లో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురి మృతి

మధ్యప్రదేశ్ లో రెండు రైళ్లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలోని సిలిగురి జిల్లా బైధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకి ఈ ఘటన జరిగింది. ఎన్టీపీసి(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్) కి చెందిన ఈ రెండు రైళ్లు , ఉత్తర ప్రదేశ్ లోని రిషద్ నగర్, మధ్య ప్రదేశ్ లోని అమ్లోరీ మధ్య నడుస్తాయని,  బొగ్గు తరలించే సమయంలో  ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

ఇందులో ఒక రైలు ఖాళీగా వస్తుండగా.. మరొకటి లోడ్ తో  వెళ్తోందని అధికారులు చెప్పారు. ఖాళీగా వస్తున్న రైలుకు చెందిన ఇంజన్, పదమూడు బోగీలు పట్టాలు తప్పాయని, కొన్ని పూర్తిగా బోల్తా పడ్డాయని వెల్లడించారు.  ఈ ప్రమాదంలో ఇద్దరు రైలు లోకో పైలట్ల (రైలు నడిపేవారు) తో పాటు మరో వ్యక్తి మరణించారు.