కశ్మీర్‎లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

కశ్మీర్‎లో బాంబు పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‎లో మందుపాతర పేలి ఇద్దరు సైనికులు అమరులవ్వగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. శనివారం సాయంత్రం నౌషెరా సెక్టార్‎లో నియంత్రణ రేఖకు దగ్గరగా పేలుడు జరిగింది. ఈ పేలుడులో లెఫ్టినెంట్ రిషి కుమార్, సిపాయ్ మంజీత్ సింగ్‎లు అమరులయ్యారని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ ప్రకటించింది. అక్కడే డ్యూటీలో ఉన్న మరో ముగ్గురు సైనికులు గాయపడగా... వారిని ఆర్మీ హాస్పిటల్‎కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.