రాజౌరీ: జమ్ము కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు టెర్రిరిస్టులు హతమయ్యారు. జిల్లాలోని థన్నమండీ అటవీ ప్రాంతంలో ముగ్గురు, నలుగురు వరకూ టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ, జమ్ము పోలీసులు కలిసి ఆపరేషన్ షురూ చేశారు. వాళ్లు ఉన్న ప్రాంతానికి చేరుకోగానే హోరాహోరీ గన్ ఫైట్ మొదలైంది. ఈ ఆపరేషన్లో పై చేయి సాధించిన మన బలగాలు శుక్రవారం మధ్యాహ్నం వరకే ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారని, ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని జమ్ము జోన్ అడిషనల్ డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. ఆ అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నారని భావిస్తున్న నలుగురు టెర్రరిస్టుల్లో ఇద్దరు పాకిస్థాన్కు చెందిన వాళ్లని ఆయన చెప్పారు. కశ్మీర్ జోన్లో టెర్రరిస్టుల ఏరివేత భారీగా సాగుతుండడంతో తప్పించుకునేందుకు ఈ అడవుల్లోకి వచ్చి ఉండొచ్చని అన్నారు. అయితే గడిచిన నెల రోజులుగా థన్నమండీ ఫారెస్ట్ బెల్డ్ ఏరియాలో టెర్రిరిస్టుల జాడ గుర్తించేందుకు టెక్నాలజీని ఉపయోగించి సర్వైలెన్స్ పెట్టామని ముకేశ్ సింగ్ పేర్కొన్నారు. ఇవాళ పక్కా సమాచారం రావడంతో రంగంలోకి దిగి ఈ బలగాలు ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్ను రౌజౌరీ ఎస్పీ నబీ ఖాస్బా ఆధ్వర్యంలో జరుగుతోందని చెప్పారు.
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం
- దేశం
- August 6, 2021
లేటెస్ట్
- ఆధార్ ఫ్రీ అప్డేట్ .. 14 జూన్ వరకు పొడిగింపు .. అప్డేట్ చేసుకోండిలా..
- తెలంగాణలో దొంగలు పోయి.. గజ దొంగలు వచ్చిన్రు: కిషన్ రెడ్డి
- క్వింటా పాత అల్లం 46 వేల రూపాయలా.. కోటేశ్వర్లు అయిన రైతులు
- సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి.. సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
- మీ దేశానికో దండం: అమెరికా తరపున న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్
- బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్తంతా పోయింది : పోచారం
- Pushpa2 Teaser: పుష్ప 2 టీజర్ అప్డేట్ రివీల్ చేసిన అల్లు అర్జున్ ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్
- పవర్ బ్రోకర్లే.. బీఆర్ఎస్ ను వీడుతున్రు: హరీష్ రావు
- క్వింటా వెల్లుల్లి రూ.20 వేలు.. రైతుల పంట పడింది
- Vijay Devarakonda: బాయ్స్ అందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ.. బంపర్ ఆఫర్ ఇచ్చిన విజయ్
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?