మెదక్టౌన్, వెలుగు: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టుకొని మద్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్ఐ లింగం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలంలోని మంబోజిపల్లిలో ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లికి చెందిన జోగేలి సూర్యసింహ అనుమానాస్పదంగా సంచరిస్తుండగా గమనించిన ఏఎస్ఐ దయానంద్ అదుపులోకి తీసుకొని విచారించారు.
మెదక్ పట్టణంలోని వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి నాగ్సాన్పల్లిలో అధిక ధరకు అమ్మడానికి ఆటో గురించి వేచి చూస్తున్నట్లు తెలిపారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల మద్యాన్ని సీజ్ చేయడంతో పాటు సూర్యసింహపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
