ప్రేమించలేదని 20 ఏళ్ల యువతిని తగలబెట్టిన యువకుడు

ప్రేమించలేదని 20 ఏళ్ల యువతిని తగలబెట్టిన యువకుడు

బీహార్ ముజఫార్ పూర్ లో ఆహియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతి దక్కడంలేదనే ఆగ్రహంతో ఒంటరిగా ఉన్న బాధితురాలిపై రాజారాయ్ అనే నిందితుడు యువతిపై కిరోసిన్ పోసి తగలబెట్టాడు. మంటల్లో ఆహాకారాలు చేస్తున్న బాధితురాల్ని గమనించిన స్థానికులు అత్యవసర చికిత్స కోసం శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ కు చెందిన ఆస్పత్రికి తరలించారు.

ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న ఏఎస్సై జాహ్ విచారణ ప్రారంభించారు. విచారణలో రాజారాయ్ తన కూతుర్ని ప్రేమిస్తున్నానని నిందితుడు 3సంవత్సరాలుగా వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లి పోలీసులకు చెప్పింది. ఆ భయంతోనే కాలేజీ మాన్పించి ఇంటి నుంచే చదివిస్తున్నట్లు తెలిపింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీసుల్ని ఆశ్రయించినా ఫలితం లేదని కన్నీటిపర్యంతమైంది.

శనివారం ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ లో నైట్ షిప్ట్ లో పనిచేసేందుకు తాను వెళ్లినట్లు, అదే సమయంలో నిందితుడు ఇంట్లోకి చొరబడి తన కుమార్తెను కిరోసిన్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ దారుణంపై ముజఫర్ ఫూర్ ఎస్ ఎస్ ఎస్పీ జయంత్ కాంత్ మాట్లాడుతూ ప్రపోజల్ ను తిరస్కరించిందనే అకారణంగా ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు. నిందితుణ్ని జుడీషియల్  కష్టడీకి తీసుకున్నట్లు చెప్పారు. మొహం, లంగ్స్ తో పాటు 50శాతం శరీరం కాలిపోవడంతో బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమంగా  ఉందని జయంత్ కాంత్ వెల్లడించారు.