
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) ఫెడరేషన్ ప్రకటించిన ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డులకు రాష్ట్రంలోని 22 కంపెనీలు ఎంపిక అయ్యాయి. సంస్థ ప్రెసిడెంట్ అనిల్ అగర్వాల్, అవార్డ్స్ కమిటీ చైర్మన్ అరుణ్ లుహరుకా విజేతల పేర్లను వెల్లడించారు. పారిశ్రామిక ఉత్పాదకతలో ఎక్సలెన్స్ --వసంత్ టూల్ క్రాఫ్ట్స్, అత్యుత్తమ పనితీరు గల కంపెనీగా --మహీంద్రా & మహీంద్రా, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో విభాగంలో-- కరణ్ మసాలాలు, మార్కెటింగ్ ఇన్నోవేషన్లో --క్లౌడ్పోర్టల్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎగుమతుల్లో -నవా లిమిటెడ్,
ఎగుమతి పనితీరు విభాగంలో --హన్స్ ప్రొడక్ట్స్, న్యూ & రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్/అప్లికేషన్లో విభాగంలో -విండ్ స్ట్రీమ్ ఎనర్జీ టెక్నాలజీస్ ఇండియా, ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఇనీషియేటివ్స్లో ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో హోమ్ ఇండస్ట్రీస్, ప్రొడక్ట్ ఇన్నోవేషన్లో --శివనారాయణ్ జ్యువెలర్స్, ప్రొడక్షన్ ఎక్సలెన్స్ విభాగంలో రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరోగ్య సంరక్షణలో రెలిసిస్ మెడికల్ డివైజెస్, ఆర్ & డీ (ఎంఎస్ఈ)లో --మోషన్ డైనమిక్స్, ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమకు అత్యుత్తమ సహకారం అందించిన కంపెనీగా-- ఎంక్యూఎస్ టెక్నాలజీస్ ఎంపిక అయ్యాయి.
ఐటీలో ఆదర్శ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ , టూరిజం ప్రమోషన్ కేటగిరీలో రామోజీ ఫిల్మ్ సిటీ, పరిశ్రమ, వాణిజ్యం ఆర్థిక వ్యవస్థకు సేవలందించే అసోసియేషన్/ఛాంబర్స్ విభాగంలో--తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం, సైన్స్ లేదా ఇంజనీరింగ్ విభాగంలో డాక్టర్ నాయని కిషోర్ నాథ్, అత్యుత్తమ మహిళా పారిశ్రామికవేత్త-గా అమ్మోనియా & కెమికల్స్ డైరెక్టర్ గరిమా భార్గవ, వికలాంగ మహిళా పారిశ్రామిక వేత్తల కేటగిరీలో --హర్మెహర్ కౌర్ గ్రేవాల్, మహిళా సాధికారత విభాగంలో చేయూత ఫౌండేషన్ అవార్డులకు ఎన్నికయ్యాయి. వీటిని మంత్రి కేటీఆర్ ఈ నెల 3 న అందజేస్తారు.