
జోగిపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 270 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పుల్కల్ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం శివ్వంపేట రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు.
లారీ డ్రైవర్ కమ్ ఓనర్ రాజ్భాయ్ని అదుపులోకి తీసుకొని విచారించగా హైదరాబాద్ప్రాంతంలోని కాటేదాన్ నుంచి గుజరాత్ కు తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.