మైసూరు జిల్లాలోని పొలంలో డిసెంబర్ 7న మూడు చిరుతపులి పిల్లలు కనిపించాయి. దీన్ని చూసి ఆశ్చర్యానికి గురైన గ్రామస్తులు ఆ పులి పిల్లలను చేతుల్లో పట్టుకుని పిల్లలతో ఆడుకోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మైసూరులోని స్థానికులకు పొలంలో దొరికిన పిల్లల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. అనంతరం పలు నివేదికల ప్రకారం పిల్లలను వారు అటవీ శాఖకు అప్పగించారు.
Xలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముగ్గురు గ్రామస్థులు రెండు చిరుతపులి పిల్లలను, ఒక నల్ల చిరుతపులి పిల్లను పట్టుకున్నారు. చిరుతపులి పిల్లను పట్టుకున్న వారిలో ఒకరు స్థానిక భాషలో మాట్లాడుతుండగా.. ఈ సంఘటన మొత్తం ఓ కెమెరాలో రికార్డ్ చేయబడింది.
ALSO READ:డబ్ల్యూపీఎల్ కమిటీ హెడ్గా రోజర్ బిన్నీ
కర్ణాటకలో..
నవంబర్లో ఓ చిరుతపులి.. బైక్పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసింది. చిరుతపులిని పట్టుకునేందుకు కర్ణాటక రాష్ట్రం భారీ ఆపరేషన్ చేపట్టింది. బెంగళూరులోని బొమ్మనహళ్లి ఇండస్ట్రియల్ ఏరియాలో మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. ఎట్టకేలకు చిరుతపులిని బెంగళూరులో పట్టుకున్నారు.
#WATCH | Karnataka: Three leopard cubs were found in a field in the Mysuru district and were later handed over to the forest department. (07/12) pic.twitter.com/uCLTSTMLgt
— ANI (@ANI) December 8, 2023