ఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్ కేసు..ముగ్గురికి మరణశిక్ష

ఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్ కేసు..ముగ్గురికి మరణశిక్ష
  • కర్నాటకలోని గంగావతి సివిల్ కోర్టు తీర్పు

కొప్పళ: ఇజ్రాయెల్  పర్యటకురాలితో పాటు ఓ స్థానిక మహిళపై అత్యాచారానికి పాల్పడి మరో వ్యక్తిని హత్య చేసినందుకు ముగ్గురు దోషులకు కర్నాటకలోని గంగావతి సివిల్  కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసులో మల్లేష్  అలియాస్  హండి మల్ల, శరణబసవ, చైతన్య సాయిని దోషులుగా నిర్ధారించి తీర్పు వెలువరించింది. ఇజ్రాయెల్  మహిళ, బిభాస్(ఒడిశా), పంకజ్(మహారాష్ట్ర), డానియెల్ (అమెరికా) నిరుడు కర్నాటకలో పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. 

హాస్టల్  నడిపే ఓ మహిళా ఓనర్  మార్చి 7న వారిని సైట్ సీయింగ్​కు తీసుకెళ్లారు. వారంతా గంగావతిలోని సనాపూర్​లో ఉండగా.. దోషులు ముగ్గురూ వచ్చి వారితో గొడవపెట్టుకున్నారు. పంకజ్, బిభాస్, డానియెల్​ను తుంగభద్ర కెనాల్​లోకి తోశారు. బిభాస్​కు ఈత రాకపోవడంతో అతను నీటిలో మునిగి చనిపోయాడు.  వారు నీటిలో ఉండగా.. హాస్టల్  ఓనర్, ఇజ్రాయెల్  మహిళపై దుండగులు అత్యాచారం చేశారు.