భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

హిమాచల్ ప్రదేశ్ రోహ్‌తంగ్‌లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ (ఎస్‌పి) సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. జనవరి 30న జరిగిన ఈ ఘటనలో 300 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్న ATR సౌత్ పోర్టల్ (SP) సమీపంలో దాదాపు 50 వాహనాలు, ఒక హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (HRTC) బస్సు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో ATR నుంచి పర్యాటకులందరినీ ఖాళీ చేయించారని కులు ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు.

అంతకుముందు హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాలలో భారీ హిమపాతం, జనవరి 30 నుండి ఫిబ్రవరి 3 వరకు వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా, లాహౌల్-స్పితి, కిన్నౌర్, చంబా, కులు, మండి, సిర్మూర్, సిమ్లా జిల్లాల్లోని ఎత్తైన ప్రాంతాలు, సిమ్లా, పరిసర ప్రాంతాలలో భారీ హిమపాతం, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని దిగువ కొండలు, మైదానాల్లోనూ ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశముందని, ఎత్తైన కొండలలోని పలు ప్రాంతాల్లో ఈ కాలంలో ఈదురు గాలులను రావచ్చని అంచనా వేసింది.